అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
360 కిలోల గంజాయి స్వాధీనం
Aug 12 2016 4:13 PM | Updated on Sep 4 2017 9:00 AM
కొవ్వూరు: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 11 లక్షల విలువైన 360 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా బలపంకోరుకొండ నుంచి విజయవాడకు బొలేరో వాహనంలో గంజాయి తరలిస్తుండగా.. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. బొలేరో డ్రైవర్తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఐదు మూటల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Advertisement


