15న కందుకూరికి కిన్నెర సాహితీపురస్కారం | 15na kandukuriki kinnera award | Sakshi
Sakshi News home page

15న కందుకూరికి కిన్నెర సాహితీపురస్కారం

Jun 14 2017 12:16 AM | Updated on Sep 5 2017 1:31 PM

కొత్తపేట మండలం మోడేకుర్రు గ్రామానికి చెందిన విశ్రాంత సంస్కృతాంధ్ర ఉపన్యాసకుడు కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ కిన్నెర సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. కిన్నెర ఆర్ట్‌ థియేటర్, ద్వానా సాహితీ కుటీరం సంయుక్త ఆధ్వర్యంలో కందుకూరి ఈ పురస్కారాన్ని

రాజమహేంద్రవరం కల్చరల్‌:
కొత్తపేట మండలం మోడేకుర్రు గ్రామానికి చెందిన విశ్రాంత సంస్కృతాంధ్ర ఉపన్యాసకుడు కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ కిన్నెర సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. కిన్నెర ఆర్ట్‌ థియేటర్, ద్వానా సాహితీ కుటీరం సంయుక్త ఆధ్వర్యంలో కందుకూరి ఈ పురస్కారాన్ని ఈ నెల 15వ తేదీన హైదరాబాద్‌లో అందుకోనున్నారు. అష్ట దిగ్గజాలలో ఒక్కరైన అయ్యలరాజు రామభద్రుడు రచించిన రామాభ్యుదయ కావ్యానికి కందుకూరి రచించిన వ్యాఖ్యాన గ్రంథానికి ఈ పురస్కారం లభిస్తుంది. నగరానికి చెందిన ప్రజ్ఞారాజహంస చింతలపాటి శర్మ, ప్రాచార్య శలాక రఘునాథ శర్మ, భాగవతవిరించి డాక్టర్‌ టివి.నారాయణరావులు కందుకూరికి తమ అభినందనలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement