హిమాచల్ ప్రదేశ్ లోని పలు హిందూ దేవాలయాల్లో చైత్ర శ్రీరామ నవమి ఉత్సవాలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
జమ్ము: హిమాచల్ ప్రదేశ్ లోని పలు హిందూ దేవాలయాల్లో చైత్ర శ్రీరామ నవమి ఉత్సవాలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బిలాస్పూర్లోని నైనాదేవి, ఉనాలోని చింతపూర్ని, కాంగ్రా జిల్లాలోని జ్వాలాజీ, బ్రజేశ్వరీ దేవీ తదితర దేవాలయల్లో వేలాదిమంది భక్తుల సందడి నెలకొంది. తొమ్మిది రోజులు పాటు జరిగే ఉత్సవాలు మార్చి 28 శ్రీరావ నవమితో ముగుస్తాయి. దాదాపు ఇరవైవేలమంది భక్తులు హాజరవుతారని బ్రజేశ్వరీ దేవాలయ అధికారి పవన్ బాద్యల్ తెలిపారు. చివరి రెండు రోజులు ఉత్సవాలు మరింత ఘనంగా నిర్వహించేందుకు , బ్రజేశ్వరీ, నైనాదేవీ అమ్మవారి ప్రత్యక్ష దర్శనంకోసం ఆన్లైన్లో ఏర్పాట్లు చేశామనీ ఆయన తెలిపారు.


