భవనంపై నుంచి పడి యువకుడు మృతి

సాక్షి, చందానగర్‌: హైదరాబాద్‌ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారా నగర్‌లో భవనంపై నుంచి పడి ఓ యువకుడు మృతిచెందాడు. భవనం రెండవ అంతస్తుపై నుండి ఉమర్ పాషా (27) అనే వ్యక్తి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఏడాది క్రితమే వివాహం అయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధి ఆస్పత్రికి తరలించారు. ప్రదవశాత్తు జరిగిందా లేక హత్యా అన్నకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top