బైకు కొనివ్వలేదని  యువకుడు ఆత్మహత్య

Young Man Suicide For Bike In Rangareddy - Sakshi

ఆమనగల్లు : తల్లిదండ్రులు బైకు కొనివ్వలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఆమనగల్లు ఎస్సై మల్లీశ్వర్‌ కథనం ప్రకారం... ఆకుతోటపల్లికి చెందిన మహేశ్‌(22).. తల్లిదండ్రులను బైక్‌ ఇప్పించాలని కోరగా వారు నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన మహేశ్‌ ఇంట్లో చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహేశ్‌కు ఆర్థిక సమస్యలు కూడా ఉన్నట్టు పలువురు పేర్కొంటున్నారు. మృతుడి తండ్రి సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top