మహిళ అస్థిపంజరం లభ్యం

Women Skeleton In Medak - Sakshi

జూకల్‌లో కలకలం

పెద్దశంకరంపేట(మెదక్‌) : మండల పరిధిలోని జూకల్‌ శివారులో  గుర్తుతెలియని మహిళ అస్థిపంజరం లభ్యమైనట్లు ఎస్‌ఐ విజయరావ్‌ శుక్రవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులో మహిళ మృత దేహం ఉన్నట్లు గ్రామస్థుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించామన్నారు.

సుమారు 35 నుంచి 40 ఏళ్ల లోపు మహిళ అస్థిపంజరంగా గుర్తించామన్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉంది. మృతదేహంపై ఎరుపురంగు చీర, ఎరుపు,తెలుపు జాకెట్‌ ధరించి ఉన్నట్లు ఆయన తెలిపారు. వీఆర్వో అశోక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top