విహార యాత్రలో విషాదం

Two Students Missing In Kadapa Palakondalu - Sakshi

నీటిలో మునిగి ఇద్దరు విద్యార్థుల గల్లంతు

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: విహార యాత్ర విషాదాన్ని నింపింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఆరుగురు విద్యార్థులు కడప నగర శివారులోని పాలకొండలకు విహారయాత్రకు వెళ్లారు. వారిలో ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగి గల్లంతయ్యారు. విహారయాత్రకు వచ్చిన వారంతా మూగ, చెవిటి విద్యార్థులు కాగా, బికాం చదువుతున్నారు. గల్లంతయిన విద్యార్థులను పొరుమామిళ్లకు చెందిన రసూల్‌, నెల్లూరుకు చెందిన అనిల్‌గా గుర్తించారు.  విద్యార్థుల  కోసం రిమ్స్‌ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top