
గాయపడ్డ వ్యక్తులు
పిట్లం(జుక్కల్) నిజామబాద్ : మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం ట్రాక్టర్–బైకు ఢీకొన్నాయి. దీం తో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద కొడప్ గల్ మండలంలోని వడ్లం గ్రామానికి చెందిన పండరి, సాయిలు, శివాజీ బైకుపై పిట్లంలోని ఇంటికి తిరిగి వెళ్తుండగా బంక్ సమీపంలో జాతీయ రహదారిపై రహదారిపై రెండు వాహనాలు ఢీకొనడంతో పండరి, శివాజీ కాళ్లు విరిగాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.