సాక్షి,సిటీబ్యూరో: నగరంలోని ఓ కంపెనీలో బ్యాక్డోర్ ద్వారా ఉద్యోగం ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళ వారం అరెస్టు చేశారు.రాచకొండ సీపీ మహేష్ భగవత్ కథనం ప్రకారం... బీటెక్ పూర్తి చేసిన నరేందర్ రెడ్డి ఉద్యోగం కోసం అన్వేషిస్తూ చింతల్లోని రాధా కన్సల్టెన్సీ ఎండీ శ్రావణి కోటిపల్లికి తన రెస్యూమ్ ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అతడికి కూకట్పల్లిలోని ఎకో పౌండ్ సిస్టమ్స్ రిక్రూటింగ్ ఏజెంట్ను రాఘవేంద్ర పేరుతో ఫోన్ వచ్చింది. టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేసిన అతను ఏకో పౌండ్ సిస్టమ్ లో ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగానికి ఎంపికయ్యావంటూ గతేడాది అక్టోబర్ 30న కంపెనీ మెయిల్ ఐడీ నుంచి బాధితుడి మెయిల్కు ఆఫర్ లెటర్ పంపాడు.
బ్యాక్డోర్ ప్రాసెసింగ్ చార్జీల కింద రూ.1,10,00 చెల్లించాలని రాఘ వేంద్ర చెప్పడంతో అతడిచ్చిన రెండు బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమచేశాడు. ఆ తర్వాత నుంచి ఫోన్ చేసినా ఎటువంటి సమాధానం రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన నరేందర్ రెడ్డి రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ సైదులు నేతృత్వంలోని బృందం టెక్నికల్ డాటా ఆధారం గా అలియాబాద్లో అతడిని అరెస్టు చేసింది.
బ్యాక్డోర్ ఎంట్రీ పేరుతో టోకరా : నిందితుడి అరెస్టు
Published Wed, Feb 28 2018 2:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
Advertisement