ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

Six People Losts Breath In Road Accident In Chennai - Sakshi

చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. మినీ వ్యాన్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన గురువారం తిరువూరు జిల్లాలో చోటుచేసుకుంది. తిరువూరు సమీపంలో వేగంగా వెళుతున్న ఓ కారు.. మినీ వ్యాన్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతులను మెడికో విద్యార్థులుగా గుర్తించారు.

చదవండి : అక్కా చెల్లెలిపై ఐదుగురి లైంగికదాడి..

నకిలీ శానిటైజర్స్‌ గుట్టురట్టు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top