ప్రేమించకపోతే యాసిడ్‌ పోసి చంపేస్తా 

Person Gives Warning To Women Attacking With Acid In Hyderabad - Sakshi

సాక్షి, గౌతంనగర్‌ : తనను ప్రేమించాలని ఓ యువతిని వేధించడమే కాకుండా ఆమె ఉద్యోగం చేస్తున్న ప్రాంతానికి వెళ్ళి ప్రేమించకపోతే యాసిడ్‌ పోసి చంపేస్తానని బెదిరిస్తున్న ఓ యువకుడిని మల్కాజిగిరి పోలీసులు శనివారం  అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ హరీష్‌ తెలిపిన మేరకు..వసంతపురి కాలనీకి చెందిన సంగ శ్రీనివాస్‌(25) ప్రైవేటు ఉద్యోగి. కాగా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఓ యువతి(20)ని కొంతకాలంగా ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలని,  లేకపోతే నీ కుటుంబ సభ్యులను యాసిడ్‌పోసి చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఆ యువతి ఉద్యోగం చేసే ప్రాంతానికి వెళ్ళి బెదిరింపులు చేయడంతో యువతి మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శ్రీనివాస్‌ను శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top