పాపికొండలు విహార యాత్రలో విషాదం
సాక్షి, వి.ఆర్.పురం: పాపికొండల విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. విహార యాత్రకు వచ్చిన హైదరాబాద్కు చెందిన బ్యాంకు ఉద్యోగి ఇక్కడి కొల్లురు బ్యాంబో హట్స్లొ బస చేశారు. అయితే అతనికి గుండెపోటు రావడంతో హుటాహుటిని తూర్పుగోదావరిజిల్లా వి.ఆర్.పురం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆయన అప్పటికే మృతిచెంది నట్లు వైద్యులు నిర్ధారించారు.