అదనపు కట్నం తేలేదని.. | married woman suspicious death | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Feb 10 2018 7:06 AM | Updated on Feb 10 2018 7:06 AM

married woman suspicious death - Sakshi

జీవిత (ఫైల్‌)

బొమ్మనహళ్లి :  వరకట్నం వేధింపుల నేపథ్యంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈఘటన  ఆనేకల్‌లో వెలుగు చూసింది.  బహుదూరు పుర ప్రాంతంలో నివాసం ఉంటున్న మోహన్‌కు ఎనిమిది నెలల క్రితం జీవిత (21)తో  వివాహమైంది. కట్నంగా 120 గ్రాముల బంగారం, రూ.75 వేలు నగదు ఇచ్చారు. అయితే అదనపు కట్నం తేవాలని  జీవితను అత్త గౌరమ్మ, మామ నాగరాజు, అడపడచు శ్వేతలు వేధించేవారని సమాచారం.  ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లిదండ్రులకు తెలపగా వారు సర్ది చెప్పారు.

ఇటీవల అనారోగ్యానికి గురై పుట్టింటికి వెళ్లిన జీవిత..బుధవారం తిరిగి అత్తవారింటికి వచ్చింది. ఈక్రమంలో గురువారం రాత్రి మోహన్‌ జీవిత తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి మీ కుమార్తె ఉరి వేసుకుందని,  ఆస్పత్రికి తరలించామని సమాచారం ఇచ్చాడు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకోగా జీవిత విగతజీవిగా కనిపించింది. తమ కుమార్తెను భర్త, అత్తమామ, కలిసి వరకట్నం కోసం హత్య చేసి ఆత్మహత్యగా సృష్టిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మోహన్, అతని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement