మావోయిస్టుల దాడిలో సబ్ ఇన్‌స్పెక్టర్ మృతి | Maoists Bandh Call In Chhattisgarh | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల దాడిలో సబ్ ఇన్‌స్పెక్టర్ మృతి

May 25 2018 6:43 PM | Updated on Oct 9 2018 2:49 PM

Maoists Bandh Call In Chhattisgarh - Sakshi

సాక్షి, సుక్మా : ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లా జేగురుకోండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మృతి చెందారు. సుక్మా జిల్లా ఎస్‌పి మీనా తెలిపిన వివరాల ప్రకారం..  తమేలవాడ అటవీ ప్రాతంలో పోలీస్‌ కోబ్ర బలగాలు కూంబింగ్‌ నిర్వహించాయి. ఆ సమయంలో పోలీసులే లక్ష్యంగా ఈఈడీ మందుపాతరను మావోయిస్టులు పేల్చారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజ్‌కుమార్‌ను జగదల్‌పూర్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందారు.

రాజనంద్‌గావ్‌ జిల్లాలోని మాన్‌ పూరహల్‌ ప్రాంతంలో వెదురు డిపోను కూడా మావోయిస్టులు దగ్ధం చేశారు. ఈ ఘటనలో సూమారు రూ. 10 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. బీజాపూర్‌ జిల్లా కోహకి-​కొర్‌కట్టా రహదారులపై చెట్లను నరికి రోడ్డుకు అడ్డంగా పడేశారు. ఈ బూటకపు ఎన్‌కౌంటర్లకు నిరసనగా చేపట్టిన బంద్‌ను జయప్రదం చేయాలని పోస్టర్లను రోడ్డుపై ప్రదర్శించారు. బూటకపు ఎన్‌కౌంటర్లకు నిరసనగా ఆరు రాష్ట్రాల్లో బంద్‌కు మావోయిస్టులు నేడు పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement