Man Killed his Brother in Miyapur, Hyderabad - Sakshi
Sakshi News home page

Oct 8 2018 3:51 PM | Updated on Oct 8 2018 8:21 PM

Man Killed Brother In Miyapur In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అత్తాపూర్‌లో నడిరోడ్డుపై ఓ వ్యక్తిని పట్టపగలు నరికిచంపిన ఘటన మరువక ముందే అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నడిగడ్డ తండాలో సొంత తమ్ముడిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. అన్నాదమ్ముల మధ్య నెలకొన్న ఆస్తి తగాదా ఈ హత్యకు దారితీసినట్టు సమాచారం. ఇల్లు అమ్మిన డబ్బుల కోసం గత కొంతకాలంగా వీరిమధ్య వివాదం కొనసాగుతోంది. ఈ రోజు తెల్లవారుజామున తమ్ముడు రవీందర్‌ తన స్నేహితుడు సాయితో కలిసి అన్న రాందాస్‌ను నరికి చంపినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement