ఎలుకలు పట్టేందుకు వెళ్లి..
పొదలకూరు: మండలంలోని విరువూరు గ్రామంలో శుక్రవారం గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్సై అల్లూరు జగత్సింగ్ కథనం మేరకు వివరాలు.. వరిచేలల్లో ఎలుకలను పట్టేందుకు వచ్చిన నల్లబోతుల గంగయ్య(38) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం నెల్లూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.