భార్య, అత్త వేధింపులు తాళలేక

Man Commits Suicide Attempt With Wife Harassment - Sakshi

యువకుడి ఆత్మహత్యాయత్నం

సంతోష్‌నగర్‌: భార్య, అత్త వేధింపులను తాళలేక ఓ యువకుడు నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన  సంఘటన సంతోష్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రియాసత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ షాయోద్దీన్, షాహినాథ్‌ బేగంకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె. గత కొన్ని రోజులుగా భార్య షాహినాథ్‌ బేగం, అత్త అమీనా తరచూ  షాయోద్దీన్‌ను వేధిస్తున్నారు.

మూడు రోజుల క్రితం షాహినాథ్‌ బేగం ఘాన్సీబజార్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు. ఆ తర్వాత షాయోద్దీన్‌ను కుమార్తెను చూడాలని ఉందని కోరినా షాహినాథ్‌ బేగం అందుకు నిరాకరించడంతో మనస్తాపానికిలోనైన  అతను శుక్రవారం తెల్లవారుజామున ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీనిని గుర్తించిన స్థానికులు అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం 55 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top