ప్రేమజంట ఆత్మహత్యాయత్నం | Love Couple Suicide Attempt In Tamilnadu | Sakshi
Sakshi News home page

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

May 6 2018 6:48 AM | Updated on May 6 2018 6:48 AM

Love Couple Suicide Attempt In Tamilnadu - Sakshi

చికిత్స పొందుతున్న బిను, జయసూర్య

తమిళనాడు, అన్నానగర్‌: కూడంగుళంలో ఉన్న హాస్టల్‌లో కేరళకి చెందిన ప్రేమజంట శుక్రవారం విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రాణాపాయస్థితిలో వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు.. కేరళ రాష్ట్రం కొల్లం రాణిపురానికి చెందిన అయ్యస్వామి భార్య జయసూర్య (30). వీరికి ఇద్దరు పిల్లలు. అయ్యస్వామి హోటల్‌ నడుపుతున్నాడు. హోటల్‌కి ఆ ప్రాంతానికి చెందిన దాసన్‌ కుమారుడు బిను (41) తరచూ వచ్చేవాడు. ఇతనికి వివాహం జరిగి భార్య, 17 ఏళ్ల, 15 ఏళ్ల వయస్సున్న ఇద్దరు పిల్లలున్నారు. ఈ స్థితిలో హోటల్‌కి వచ్చి వెళుతున్న బినుకి జయసూర్యకి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలిసి ఇద్దరిని ఖండించారు.

గత కొన్ని రోజులకు ముందు బిను, జయసూర్య ఊరువదలి కన్యాకుమారికి వెళ్లారు. రెండు రోజులకు ముందు నెల్‌లై జిల్లా కూడంకులంలో ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో గది బాడుగకు తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం గది ఖాళీ చేస్తామని హాస్టల్‌ కార్మికుల వద్ద తెలిపారు. కాని చాలా సేపు గది తెవకపోవడంతో కార్మికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టి చూసినప్పుడు బిను, జయసూర్య ఇద్దరు విషం తాగి స్పృహతప్పి పడి ఉన్నారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న వారిని పోలీసులు రక్షించి చికిత్స కోసం ఆచారిపల్లం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ వారికి డాక్టర్లు తీవ్ర చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఇరు కుటుంబీకులకు సమాచారం అందించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement