యాంకర్‌ రష్మీ కారు ఢీ, ఒకరికి తీవ్ర గాయాలు | Lorry Driver Injured in Anchor Rashmi Car Accident Visakhapatnam | Sakshi
Sakshi News home page

యాంకర్‌ రష్మీ కారు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు

Published Mon, Mar 18 2019 11:01 AM | Last Updated on Wed, Mar 20 2019 1:32 PM

Lorry Driver Injured in Anchor Rashmi Car Accident Visakhapatnam - Sakshi

గాయపడిన సయ్యద్‌ అబ్దుల్‌

అగనంపూడి (గాజువాక): నటి, యాంకర్‌ రష్మీ ప్రయాణిస్తున్న కారు ఢీకొన్న సంఘటనలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ జాతీయ రహదారి కూర్మన్నపాలెం ఆర్టీసీ డిపో సమీపంలో ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. 

రష్మీ అనకాపల్లిలో ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి గాజువాకకు వస్తుండగా కూర్మన్నపాలెం డిపోకు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ...రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో చిత్తూరు జిల్లా గుర్రంకొండకు చెందిన  లారీ డ్రైవర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అతడిని నగరంలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఇక సంఘటన సమయంలో రష్మీతో పాటు ఆమె తల్లి కూడా కారులో ప్రయాణం చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన కారు డ్రైవర్‌ ఎం.ఎ.గౌతమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement