రోడ్డు ప్రమాదం.. కారణమైన ఇద్దరు అరెస్టు.. | Lingampally Road Accident: Police Catch Two Persons  | Sakshi
Sakshi News home page

Jun 30 2018 4:48 PM | Updated on Aug 30 2018 4:17 PM

Lingampally Road Accident: Police Catch Two Persons  - Sakshi

సాక్షి, రంగారెడ్డి : గత నాలుగు రోజుల క్రితం(జూన్‌ 25వ తేది) రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, లింగంపల్లి వద్ద  ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి కారణమైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో ఐదు మంది మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఇంచార్జ్‌ డీసీపీ ప్రకాష్‌ రెడ్డి మాట్లాడుతూ.. కారు డ్రైవర్‌ మద్యం మత్తులో కారు నడిపినట్లు అదుపులోకి తీసుకున్న వ్యక్తులు ఒప్పుకున్నారని చెప్పారు. అందుచేతనే ప్రమాదం జరిగిందని డీసీపీ తెలిపారు. వీరంతా ఆటోలో కూరగాయలను హైదరాబాద్‌ తీసుకువస్తూ మృత్యువాత పడ్డిన విషయం విదితమే. మృతుల్లో నలుగురు మహిళలే ఉండటం హృదయ విదారకం. 

సంబంధిత వార్త : కారు-ఆటో ఢీ : ఐదుగురి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement