అగ్ని ప్రమాదం.. 15 మంది చిన్నారుల మృతి | At Least 15 Haiti Orphanage Children Died In Fire Accident | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదం.. 15 మంది చిన్నారుల మృతి

Feb 15 2020 8:24 AM | Updated on Feb 15 2020 8:30 AM

At Least 15 Haiti Orphanage Children Died In Fire Accident - Sakshi

ఈ దుర్ఘటనలో సుమారు 15 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. మరో 60 మందిని అగ్నిమాపక దళాలు రక్షించగలిగాయి.

పోర్ట్‌ అవు ప్రిన్స్‌ : కరీబియన్‌ దేశం హైతీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఎన్జీవో నిర్వహిస్తున్న వసతి గృహం మంటల్లో కాలిపోయింది. రాజధాని పోర్ట్‌ అవు ప్రిన్స్‌లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో సుమారు 15 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. మరో 60 మందిని అగ్నిమాపక దళాలు రక్షించగలిగాయి. ప్రమాదానికి గురైంది అమెరికాకు చెందిన క్రైస్తవ మత ఎన్జీవో ‘బైబిల్‌ అండర్‌స్టాండింగ్‌’ అనాథశరణాలయంగా తెలిసింది. హైతీలో రెండు అనాథ శరణాలయాను నిర్వహిస్తున్న సదరు ఎన్జీవో 150 మంది అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తోంది. ఇక అగ్ని ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసిన హైతీ అధ్యక్షుడు జోవినల్‌ మాయిజ్‌.. దర్యాప్తునకు ఆదేశించారు. వెలుగుతున్న క్యాండిల్‌ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement