మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణం | Husband Attack On Wife By Knife in Mahabubnagar district | Sakshi
Sakshi News home page

మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణం

Apr 11 2018 12:05 PM | Updated on Oct 8 2018 5:07 PM

Husband Attack On Wife By Knife in Mahabubnagar district - Sakshi

మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.

సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని మక్తల్ మండలం ముసులేపల్లిలో బుధవారం మహిళా హెడ్‌మాస్టర్‌పై ఆమె భర్త కత్తితో దాడి చేశాడు. పాఠశాలలోనే జరిగిన ఈ ఘటనలో హెడ్‌మాస్టర్ కన్యాకుమారి తీవ్రంగా గాయపడింది. అనంతరం భర్త కూడా గొంతుగోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గ్రామస్తులు ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కుటుంబ కలహాలతో భర్త రమణారెడ్డి దాడి చేసినట్లుగా సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement