ఇద్దరు పిల్లలతో గృహిణి అదృశ్యం | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లలతో గృహిణి అదృశ్యం

Published Thu, Jun 25 2020 12:11 PM

House Wife And Children Missing Case File in Hyderabad - Sakshi

బహదూర్‌పురా: కాలాపత్తర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ గృహిణి ఇద్దరు పిల్లలతోసహా అదృశ్యమైంది. ఏఎస్‌ఐ వెంకటరమణ తెలిపిన మేరకు.. మిశ్రీగంజ్‌లో ఖాజా పాషా, ఆఫ్రీన్‌ బేగం (21) నివాసమున్నారు. వీరికి నబియా బేగం (5), సల్మాన్‌ (2) సంతానం ఉన్నారు. ఈ నెల 20న సాయంత్రం 4.30 గంటలకు దుకాణంలో తినడానికి వస్తువులను కొనుగోలు చేయడానికి ఆఫ్రీన్‌ బేగం ఇద్దరు పిల్లలతో కలిసి బయటికి వెళ్లింది. సాయంత్రం అయినా తిరిగి ఖాజా పాషా చుట్టు పక్కల ప్రాంతాలు వెతికాడు.  ఫలితం లేకుండా పోవడంతో బుధవారం పోలీ సులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement