వేడి నీటి పైపు పేలి అయిదుగురు మృతి

Five Killed After Boiling Water Floods Russian Hotel In Perm  - Sakshi

మాస్కో : వేడి నీటి పైపు పేలి అయిదుగురు మరణించిన ఘటన రష్యాలో చోటు చేసుకుంది. పెర్మ్‌ నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో ఉన్న హోటల్‌లో సోమవారం సాయంత్రం వేడి నీటితో ఉన్న పైపు పేలింది. దీంతో మరుగుతున్న వేడి నీరుహోటల్‌ గదుల్లోకి రావడంతో ఓ చిన్నారితో సహా అయిదుగురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లోని ఓ మహిళ శరీరం 35 శాతం  కాలిపోయి ఆమె పరిస్థితి విషమంగా ఉండగా మిగతా ఇద్దరు పరిస్థితి సాధారణంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ ఘటనను ఘోర ప్రమాదమని, ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రాంతీయ గవర్నర్‌ మాగ్జిమ్‌ రేషెట్నికోవ్‌ అన్నారు. అదే విధంగా వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా సోమవారం ఉదయమే పైపు లీకేజ్‌ అవుతున్నట్లు ఓ వీడియోలో రికార్డు అయ్యింది. పేలిన పైపు 1962 నుంచి ఉపయోగిస్తున్నారని, గతంలో అనేక సార్లు విరిగిపోయినట్లు స్థానిక వార్తా సంస్థ నివేదించింది.అయితే గతంలో సంభవించిన పేలుల్లో ఎవరికీ ఎలాంటి హానీ  జరగలేదని ఈ సారి మాత్రం యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం సంభవించిదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top