దంతెవాడలో మావోయిస్టుల విధ్వంసం

Chhattisgarh: 9 vehicles including Dumper and JCB set on fire by naxals - Sakshi

సాక్షి, ఛత్తీస్‌గఢ్‌: దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు మరోసారి విధ్వంసానికి పాల్పడ్డారు. ఎస్సార్‌ ఫ్లాంట్‌ వద్ద నిలిపి ఉంచిన వాహనాలను ఆదివారం తగులబెట్టారు. జేసీబీ, డంపర్‌ సహా తొమ్మిది వాహానాలకు మావోయిస్టులు నిప్పు పెట్టారు. కాగా సుకుమా జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో డీఆర్‌జీ జవాన్లు, మావోయిస్టుల మధ్య శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనకు నిరసనగా మావోయిస్టులు వాహనాల విధ్వంసానికి పాల్పడ్డారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top