విషాదం: ప్రాణం తీసిన గాలిపటం | Boy Dies Of Electric Shock In Vikarabad District | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన గాలిపటం..

Dec 8 2019 6:14 PM | Updated on Dec 8 2019 8:01 PM

Boy Dies Of Electric Shock In Vikarabad District - Sakshi

సాక్షి, పరిగి: వికారాబాద్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ షాక్‌ గురై బాలుడు మృతి చెందిన ఘటన పరిగి మండలం బాహర్పేటలో జరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఎంతో సంతోషంగా ఇద్దరు బాలురు గాలిపటం ఎగరవేయడానికి భవనంపైకి వెళ్ళారు. గాలిపటం కరెంట్‌ వైర్లకు చిక్కుకోవడంతో.. పైపు గొట్టంతో తీయడానికి బాలుడు ప్రయత్నించగా విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బాలుడి చేతికి షాక్‌ తగలడంతో తీవ్రం గాయపడ్డాడు. బాలుడిని పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రమైన శబ్దంతో కరెంట్ వైర్లు తెగిపడి కింద మరో వ్యక్తికి మీద పడ్డాయి. ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement