విద్యుత్‌ షాక్‌తో బాలుడి మృతి

Boy Died By Electric Shock - Sakshi

జన్నారం(ఖానాపూర్‌) : ఎనిమిది నెలలకే నూరేళ్లు నిండాయి. ఓ పసికందును విద్యుత్‌ షాక్‌ రూపంలో మృత్యువు కబళించింది. జన్నారం మండలం ఇందన్‌పల్లి గ్రామానికి చెందిన గుమ్ముల భూమేష్, పావని దంపతులకు గత రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.

వారికి కుమారుడు ఆదిత్య (8 నెలలు) ఉన్నాడు. ఆదివారం రాత్రి 9గంటల ప్రాంతంలో ఆదిత్య చిన్నాన సురేష్‌ బాబును ఎత్తుకుని ఇంట్లో జీరో వైర్‌కు ఆరేసిన బట్టలను తీస్తుండగా ఒక్కసారిగా కరెంటు సరఫరా అయి షాక్‌ కొట్టింది. సంతోష్‌తో పాటు ఆదిత్యకు కూడా విద్యుత్‌ షాక్‌ తగిలింది.

వారిని గమనించిన ఆదిత్య తల్లి పావని పరుగున వచ్చి విడిపించే ప్రయత్నం చేయగా ఆమెకూ విద్యుత్‌ షాక్‌ తగిలింది. పావని అత్తమ్మ కర్ర తీసుకువచ్చి వైర్‌ను కొట్టడంతో సంతోష్‌ చేయి వదిలిపెట్టి పడిపోయాడు. ఈ షాక్‌తో ఆదిత్య మృతి చెందగా సంతోష్, పావని గాయాల పాలయ్యారు.

ఆదిత్య తండ్రి భూమేశ్‌ ఉపాధి కోసం ముంబాయి వెళ్లాడు. కొడుకు మరణవార్త విని వెంటనే స్వగ్రామానికి బయలు దేరాడు. ఆదిత్య తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తహసినోద్దీన్‌ తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top