యువతిని వేధిస్తున్న ఆర్మీ ఉద్యోగి

Army Employee Forced To Marriage Woman In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: పెళ్లి చేసుకోమంటూ శ్రీనివాస్‌ అనే ఆర్మీ ఉద్యోగి తనను వేధిస్తున్నాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా కొల్లిపరకు చెందిన ఆర్మీ ఉద్యోగి శ్రీనివాస్‌కు, ఓ యువతికి గతంలో పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. అయితే పెళ్లికి ముందే తనను అనుమానిస్తున్నాడంటూ సదరు యువతి వివాహానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌ తనను పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ యువతిపై ఒత్తిడి తెచ్చాడు. పెళ్లి పేరుతో మూడేళ్లుగా యువతిని వేధింపులకు గురిచేయసాగాడు. దీంతో సదరు యువతి కృష్ణలంక పోలీసులకు శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top