హెవీ వాటర్‌ ప్లాంట్‌లో ప్రమాదం: కార్మికుడు మృతి | Sakshi
Sakshi News home page

హెవీ వాటర్‌ ప్లాంట్‌లో ప్రమాదం: కార్మికుడు మృతి

Published Sat, Jan 13 2018 5:01 PM

Accident in Heavy Water Plant: one killed - Sakshi

సాక్షి, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలోని హెవీ వాటర్‌ ప్లాంట్‌లో శనివారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మృతుడిని సీనియర్‌ టెక్నీషియన్‌ వేల్పుల వెంకటరమణ(34) అనే కార్మికుడిగా గుర్తించారు. ఇతనిది అశ్వాపురం మండలం మొండికుంట గ్రామం. మృతదేహాన్ని హెవీ వాటర్‌ ప్లాంట్‌ కాలనీ ఆస్పత్రికి తరలించారు. కాగా, గ్యాస్‌ లీకేజీ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించిన వివరాలు తెలిపేందుకు ప్లాంట్‌ అధికారులు నిరాకరిస్తున్నారు.

Advertisement
Advertisement