తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
సాక్షి, తిరుపతి: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.
బుధవారం 63,870 మంది భక్తులకు స్వామివారిని దర్శించుకున్నారు. 20,359 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ. 2.69 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.