తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

సాక్షి, తిరుపతి: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.

బుధవారం 63,870 మంది భక్తులకు స్వామివారిని దర్శించుకున్నారు. 20,359 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ. 2.69 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Read latest Chittoor News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top