24 గంటల పాటు రెడ్‌మి నోట్‌ 5 సేల్‌

Xiaomi Hosts Exclusive 24 Hour Flash Sale Of Redmi Note 5 - Sakshi

షావోమీ కంపెనీ రెడ్‌మి నోట్‌ 5 స్మార్ట్‌ఫోన్‌ ఫ్లాష్‌ సేల్‌ను రోజంతా నిర్వహించబోతోంది. నేటి అర్ధరాత్రి 11:59 నుంచి రెడ్ మి నోట్ 5 విక్రయాలను తన వెబ్‌సైట్‌ ఎంఐ.కామ్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రారంభించబోతున్నట్టు షావోమి ప్రకటించింది. సాధారణంగా ఈ ఫోన్‌ను షావోమి ప్రతి వారం ఫ్లాష్ సేల్ ద్వారా విక్రయిస్తోంది. అది కూడా మధ్యాహ్నం 12 గంటలకు మొదలై నిమిషాల్లోనే ముగిసిపోతోంది. దీంతో ఈ ఫోన్ కోరుకునే వారి కోసం షావోమి, ఎంఐ.కామ్‌ ద్వారా ఒక రోజు పాటు ఫ్లాష్‌ సేల్‌ను చేపట్టబోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెడ్ మి నోట్ 5ను కంపెనీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

రెడ్‌మి నోట్‌ 5కు సక్సెసర్‌గా దీన్ని తీసుకొచ్చింది. సెమీ-బడ్జెట్‌ ఫోన్‌ అయిన రెడ్‌మి నోట్‌ 5 రెండు వేరియంట్లలో మార్కెట్‌లోకి వచ్చింది. ఇందులో ఒకటి 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ వెర్షన్ ధర రూ.9,999. రెండోది 4జీబీ ర్యామ్, 64జీబీ ర్యామ్ ధర రూ.11,999. ఈ ఫోన్‌కు 5.99 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లే  డిస్‌ప్లే కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 625 ప్రాసెసర్‌, 12 ఎంపీ రియర్‌ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మెమరీని పెంచుకునే కెపాసిటీ, షావోమి ఎంఐయూఐ 9.5 ఓఎస్‌ ఆధారిత ఆండ్రాయిడ్‌ నోగట్‌, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ దీనిలో ఫీచర్లు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top