వైజాగ్‌ ఎయిర్‌పోర్ట్‌ మూసివేయం: ఏఏఐ | Vizag airport wont be shut due to Bhogapuram facility: AAI | Sakshi
Sakshi News home page

వైజాగ్‌ ఎయిర్‌పోర్ట్‌ మూసివేయం: ఏఏఐ

Feb 28 2019 12:16 AM | Updated on Feb 28 2019 8:55 AM

Vizag airport wont be shut due to Bhogapuram facility: AAI - Sakshi

హైదరాబాద్‌: విశాఖపట్నం విమానాశ్రయాన్ని మూసివేసే ఉద్ధేశం లేదని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) స్పష్టం చేసింది. కొత్తగా నిర్మించనున్న భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖ ఎయిర్‌పోర్టును మూసివేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భావిస్తోంది. ‘వైజాగ్‌ ఎయిర్‌పోర్టు కొనసాగుతుంది. ఈ విషయాన్ని మా మంత్రి పార్లమెంటులో స్పష్టం చేశారు కూడా. మూసివేత విషయమై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చింది. దీనికి మేం స్పందించలేదు.

దీనికి కారణం ఈ ప్రతిపాదనను మేం పరిగణలోకి తీసుకోవడం లేదు’ అని ఏఏఐ ఫైనాన్స్‌ సభ్యులు ఎస్‌.సురేశ్‌ వ్యాఖ్యానించారు. ఏఏఐతో తాము చర్చిస్తున్నట్టు ఏపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌ జైన్‌ తెలిపారు. వైజాగ్‌ ఎయిర్‌పోర్టులో చేసిన పెట్టుబడిని భర్తీ చేయాలని ఏఏఐ కోరిందని చెప్పారు. ఈ విషయాన్ని తేల్చాల్సిందిగా ఏఏఐ చెబుతోందన్నారు. ఎంత పెట్టుబడి పెట్టారో తెలపాలని, ఆ మొత్తాన్ని తాము చెల్లిస్తామంటూ లేఖ రాశామని ఆయన వివరించారు. ప్రస్తుతమున్న విమానాశ్రయం వైజాగ్‌ సిటీకి సమీపంలో ఉంది. వైజాగ్‌ సిటీ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement