వివో సరికొత్త సేల్‌, స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు

Vivo Knockout Carnival Offers Discounts and Cashbacks on Select Smartphones - Sakshi

న్యూఢిల్లీ : చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీదారి వివో సరికొత్త సేల్‌కు తెరలేపింది. వివో నాకౌట్‌ కార్నివల్‌ సేల్‌ను నిర్వహిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. మే 16(నేటి) నుంచి మే 18 వరకు ఎక్స్‌క్లూజివ్‌గా వివో అధికారిక ఆన్‌లైన్‌ స్టోర్‌లో ఈ సేల్‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లను, క్యాష్‌బ్యాక్‌లను ఆఫర్‌ చేయనుంది. ఈ మూడు రోజులు వివో వీ5 ప్లస్‌, వీ5ఎస్‌ స్మార్ట్‌ఫోన్లను కంపెనీ రూ.14,990కు, రూ.12,990కు విక్రయిస్తోంది.

వివో ఆఫర్‌ చేసే ఈ స్పెషల్‌ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు కస్టమర్లకు మెరుగైన షాపింగ్‌ అనుభవాన్ని అందించనున్నాయని వివో ఇండియా చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ కెన్నీ జెంగ్‌ తెలిపారు. ఎస్‌బీఐ క్రెడిట్‌, డెబిట్‌ కార్డు కస్టమర్లకు అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేయనున్నట్టు వివో పేర్కొంది. రూ.1000 వరకు లక్కీ డ్రా కూపన్లను వివో ఈ కార్నివల్‌లో ఆఫర్‌ చేస్తోంది. రూ.500 విలువైన బుక్‌మైషో కపుల్‌ మూవీ ఓచర్లు అందిస్తోంది. అన్ని స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్‌పైనా 12 నెలల పాటు ‘నో కాస్ట్‌ ఈఎంఐ’ ఆఫర్‌ను వివో అందుబాటులోకి తెచ్చింది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top