కొత్త వెస్పా@ రూ. 76,495 | Vespa S scooter launched at Rs 76,495 | Sakshi
Sakshi News home page

కొత్త వెస్పా@ రూ. 76,495

Mar 6 2014 1:59 AM | Updated on Jul 11 2019 6:33 PM

కొత్త వెస్పా@ రూ. 76,495 - Sakshi

కొత్త వెస్పా@ రూ. 76,495

ఇటాలియన్ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజ సంస్థ పియాజియో మంగళవారం తన మూడవ వెస్పా బ్రాండ్ ప్రీమియం సెగ్మెంట్ స్కూటర్ ‘వెస్పా ఎస్’ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది.

ముంబై: ఇటాలియన్ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజ సంస్థ పియాజియో మంగళవారం తన మూడవ వెస్పా బ్రాండ్ ప్రీమియం సెగ్మెంట్ స్కూటర్ ‘వెస్పా ఎస్’ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ ఈ స్కూటర్‌ను విడుదల చేశారు. కంపెనీ దీని ధరను రూ. 76,495 (ఎక్స్-షోరూమ్, ముంబై)గా నిర్ణయించింది.

 ప్రత్యేకతలు: 125 సీసీ ఇంజిన్ సామర్థ్యం. డిస్క్ బ్రేక్స్, ట్యూబ్‌లెస్ టైర్స్, సింగిల్ పీస్ స్టీల్ మోనోకాక్ చాసిస్. నాలుగు రంగుల్లో లభిస్తుంది.

 త్వరలో మరిన్ని లగ్జరీ స్కూటర్లు...: భారత్‌లో వ్యాపార విస్తరణ వ్యూహంలో భాగంగా అత్యంత విలాసవంతమైన విస్పా స్టేబుల్, విస్పా 946 మోడళ్లను విడుదల చేయనున్నట్లు పియాజియో వెహికల్స్ చైర్మన్ రవి చోప్రా చెప్పారు. వీటి ధరల శ్రేణి రూ. 8-9 లక్షలు ఉండొచ్చని తెలిపారు. బహుశా రానున్న రెండుమూడు నెలల్లో ఇవి మార్కెట్‌లోకి అందుబాటులోకి రావచ్చన్నారు. దేశీయ మార్కెట్‌లో ప్రవేశించిన రెండేళ్లలోనే పియాజియో 70,000 వెస్పా స్కూటర్లను విక్రయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement