పొగాకు బోర్డు చైర్మన్ కె.గోపాల్
గుంటూరు, న్యూస్లైన్ : పొగాకు ఎగుమతుల ద్వారా 2013-14 సంవత్సరంలో 6,059.31 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం వచ్చినట్లు పొగాకుబోర్డు చైర్మన్ కె.గోపాల్ చెప్పారు. గుంటూరులోని బోర్డు కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది ఎగుమతుల ద్వారా ఐదువేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం వచ్చినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో పొగాకు ఉత్పత్తులకు లక్ష్యాలను నిర్దేశించామని, ప్రతి సంవత్సరం 270నుంచి 280 మిలియన్ కేజీల పొగాకును ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు.
లక్షమంది రైతులు ఈ ప్రక్రియలో భాగస్వాములు అయ్యారని, 2.25 లక్షల ెహ క్టార్లలో వర్జీనియా పొగాకు ఉత్పత్తి చేశామన్నారు. వర్జీనియా పొగాకును సిగిరెట్ పొగాకు అని, ప్రీమియం వెరైటీ అని పిలుస్తారని చెప్పారు. ఉత్పత్తి చేసిన వర్జీనియా పొగాకులో 75శాతం ఎగుమతి చేశామని వెల్లడించారు. బోర్డు ఎగుమతి చేసిన పొగాకును 107దేశాల్లో 137 కంపెనీలు దిగుమతి చేసుకున్నాయని, పశ్చిమయూరప్కు 34శాతం, తూర్పు యూరప్కు 14శాతం, మధ్యప్రాచ్య దేశాలకు 11శాతం, ఆగ్నేయాసియాకు 20శాతం, ఆఫ్రికాకు 13శాతం, దక్షిణ అమెరికాకు 8శాతం, ఆస్ట్రేలియాకు ఒకశాతం ఎగుమతి చేసినట్లు వెల్లడించారు. మనదేశం నుంచి ఎగుమతి అయ్యే పొగాకు నాణ్యతతోపాటు శుభ్రంగా ఉండాలని ఇంటర్నేషనల్మార్కెట్ ఎదురు చూస్తోందని, రైతులనుంచి క్వాలిటీ ఉన్న పొగాకు వచ్చేలా పొగాకు బోర్డు చర్యలు తీసుకుందనీ చెప్పారు.
తద్వారా మంచిరేటు వస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో180 మిలియన్ కేజీలు ఉత్పత్తి అయ్యిందని, 19 వేలం కేంద్రాల ద్వారా 65 రోజుల్లో 75 మిలియన్ కేజీల పొగాకు మార్కెట్ అయ్యిందని చెప్పారు. .జూలై నెలాఖరునాటికి మిగిలిన పొగాకు అమ్మకాలు జరిగేలా చూస్తామని, వేలం కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ సిస్టం అన్ని చోట్లా ఉండటం వల్ల అమ్మకాలు త్వరగా జరుగుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం కిలో పొగాకుకు 171 రూపాయల ధర వచ్చిందని, హైగ్రేడ్ పొగాకు ఉత్పత్తి ఈ ఏడాది బాగా పెరిగి, లో గ్రేడ్ రేషియో తగ్గిందన్నారు. లో అండ్ మినిమమ్ గ్రేడ్కు కూడా డిమాండ్ బాగానే ఉన్నట్లు గోపాల్ చెప్పారు.
పొగాకు ఎగుమతులతో 6 వేల కోట్ల ఆదాయం
Published Wed, May 21 2014 3:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement