టెల్కోలపై రూ. 3,050 కోట్ల పెనాల్టీ | Telecom Department Can Levy Penalty On Airtel, Vodafone, Idea: Attorney General | Sakshi
Sakshi News home page

టెల్కోలపై రూ. 3,050 కోట్ల పెనాల్టీ

Jan 13 2017 1:58 AM | Updated on Sep 5 2017 1:06 AM

టెల్కోలపై రూ. 3,050 కోట్ల పెనాల్టీ

టెల్కోలపై రూ. 3,050 కోట్ల పెనాల్టీ

సేవల్లో నాణ్యత లోపించిన అంశంపై టెలికం సంస్థలు ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాపై రూ. 3,050 కోట్ల జరిమానా విధింపును అటార్నీ జనరల్‌ సమర్ధించినట్లు తెలుస్తోంది.

సరైనదేనని ‘డాట్‌’కు చెప్పిన ఏజీ?
న్యూఢిల్లీ: సేవల్లో నాణ్యత లోపించిన అంశంపై టెలికం సంస్థలు ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాపై రూ. 3,050 కోట్ల జరిమానా విధింపును అటార్నీ జనరల్‌ సమర్ధించినట్లు తెలుస్తోంది. నాణ్యత నిబంధనల ఉల్లంఘన అభియోగాలపై ఈ విధంగా పెనాల్టీ విధించేందుకు టెలికం విభాగానికి అధికారాలున్నాయని ఏజీ అభిప్రాయపడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రిలయన్స్‌ జియోకి అందించే ఇంటర్‌కనెక్ట్‌ పాయింట్స్‌ వద్ద రద్దీ, అత్యధిక స్థాయిలో కాల్‌ ఫెయిల్యూర్స్‌ మొదలైన చర్యలతో ఈ టెల్కోలు లైసెన్సు నిబంధనలు ఉల్లంఘించినందున జరిమానా విధించాలంటూ టెలికం విభాగానికి ట్రాయ్‌ సిఫార్సు చేసింది. వీటిపైనే టెలికం విభాగం.. అటార్నీ జనరల్‌ అభిప్రాయాన్ని కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement