
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ స్టాక్మార్కెట్పై సానుకూల ప్రభావం చూపింది.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ స్టాక్మార్కెట్పై సానుకూల ప్రభావం చూపింది. సెన్సెక్స్ 500 పాయింట్ల వరకు లాభపడింది. 36,311 పాయింట్ల వద్ద ప్రారంభమైన మార్కెట్ సెన్సెక్స్ సూచీ ఒక దశలో 38,989 గరిష్టస్థాయిని అందుకుంది.
ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ కూడా రెండు నెలల గరిష్టస్థాయిని అందుకుంది.140 పాయింట్లుపైగా ఎగసి 10,973 పాయింట్లకు చేరింది. కేంద్ర బడ్జెట్లో అన్ని వర్గాలకు తాయిలాలు ప్రకటించడంతో స్టాక్మార్కెట్ దూసుకుపోతోంది. అన్ని షేర్లు లాభాలబాట పట్టడంతో దలాల్ స్ట్రీట్లో సందడి వాతావరణం నెలకొంది.