⇒ జె7 మ్యాక్స్ ధర రూ. 17,900, జె7 ప్రో ధర రూ. 20,900
⇒ ఈ నెల 20 నుంచి జె7 మ్యాక్స్ విక్రయాలు, జూలై మూడోవారంలో ప్రో
సాక్షి, న్యూఢిల్లీ: శాంసంగ్ గెలాక్సీ సిరీస్లో రెండు కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. గెలాక్సీ జె7 మ్యాక్స్, జె7 ప్రో పేర్లతో రెండు స్మార్ట్ ఫోన్లను బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో శాంసంగ్ ఇండియా ఎండీ కెన్ క్యాంగ్, శాంసంగ్ ఇండియా మొబైల్ బిజినెస్ డైరెక్టర్ సుమిత్ వాలియా ఆవిష్కరించారు. జె7 మ్యాక్స్ 5.7 అంగుళాల హెచ్డీ క్వాలిటీ డిస్ప్లేతో, 13 మెగా పిక్సల్ కెమెరా( ముందు, వెనుక), 32 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం, 8.1 ఎంఎం డైమెన్షన్, 3,300 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ, 1.6 ఓక్టా మీడియాటెక్ ప్రాసెసర్లాంటి ఫీచర్లు కలిగి ఉంది. దీని ధర రూ. 17,900. దీని విక్రయాలను ఈ నెల 20వ తేదీ ప్రారంభించనుంది.
ప్రత్యేకతలివి...
ఇక జె7 ప్రో: 5.5 అంగుళాల ఫుల్లీ హెచ్డి క్వాలిటీతో, 13 మెగా పిక్సల్ ఫ్లాష్ (ఫ్రంట్ అండ్ బ్యాక్), 64 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, 3 బీజీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం, 7.8 ఎంఎం డైమెన్షన్, 3,600 ఎంఏహెచ్ సామర్థ్యంగల బ్యాటరీ, 1.6 ఓక్టా ఎక్సైనోస్ ప్రాసెసర్లాంటి ఫీచర్లతో బ్లాక్, గోల్డ్ కలర్లలో అందుబాటులోకి రానుంది. దీని ధర. 20,900. జె7 ప్రో విక్రయాలను జూలై మూడో వారంలో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా శాంసంగ్ ఇండియా మొబైల్ బిజినెస్ డైరెక్టర్ సుమిత్ వాలియా మాట్లాడుతూ.. గెలాక్సీ సిరీస్లో జె7 మ్యాక్స్, జె7 ప్రో కొత్త ట్రెండ్ను సృష్టిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ రెండు ఫోన్ల ద్వారా తీసిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడానికి వీలుగా.. ఫొటో తీసిన వెంటనే డిస్ప్లే మీద ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సింబల్స్ను చూపిస్తుందన్నారు. ఈ ఫోన్లు కొనుగోలు చేసిన జియో కస్టమర్లకు రూ. 309 రీచార్జ్పై నెలకు 10 బీజీ డేటా 12 నెలలపాటు అదనంగా లభిస్తుందని తెలిపారు.
శాంసంగ్ గెలాక్సీ సిరీస్లో మరో రెండు ఫోన్లు
Published Thu, Jun 15 2017 12:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్పురి దాకా...హోరాహోరీ
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement