జీఎస్‌కే ఫార్మా, సనోఫిలపై రూ.64 కోట్ల జరిమానా | Rs 64 crore Fined | Sakshi
Sakshi News home page

జీఎస్‌కే ఫార్మా, సనోఫిలపై రూ.64 కోట్ల జరిమానా

Jun 6 2015 1:51 AM | Updated on Oct 2 2018 4:26 PM

జీఎస్‌కే ఫార్మా, సనోఫిలపై రూ.64 కోట్ల జరిమానా - Sakshi

జీఎస్‌కే ఫార్మా, సనోఫిలపై రూ.64 కోట్ల జరిమానా

ఔషధ తయారీ కంపెనీలైన గ్లాక్సోస్మిత్‌క్లెయిన్ ఫార్మా (జీఎస్‌కే ఫార్మా), సనోఫిలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ.64 కోట్ల జరిమానా విధించింది...

న్యూఢిల్లీ: ఔషధ తయారీ కంపెనీలైన గ్లాక్సోస్మిత్‌క్లెయిన్ ఫార్మా (జీఎస్‌కే ఫార్మా), సనోఫిలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ.64 కోట్ల జరిమానా విధించింది. ఈ రెండు ఫార్మా కంపెనీలు హజ్ యాత్రికుల కోసం ప్రభుత్వానికి సరఫరా చేయాల్సిన మెనింజైటీస్ వాక్సిన్ బిడ్డింగ్ విషయంలో అక్రమాలకు పాల్పడినందుకు సీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రూ.64 కోట్ల జరిమానాలో రూ.61 కోట్లను జీఎస్‌కే, రూ.3 కోట్లను సనోఫి చెల్లించనున్నాయి. కంపెనీల మూడేళ్లలో సగటు టర్నోవర్‌ను పరిగణలోకి తీసుకొని జరిమానాను విధించడం జరిగింది. మెనింజైటీస్ వాక్సిన్ సరఫరాకు సంబంధించిన ఈ అంశంపై బయో-మెడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ రెండు ఫార్మా కంపెనీలతోపాటు కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖలపై సీసీఐకు ఫిర్యాదు చేసింది. ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మెనింజైటీస్ వాక్సిన్ కొనుగోలుకు టెండర్లను ఆహ్వానిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement