ఫిబ్రవరిలో తగ్గిన ఫండ్ల ఆస్తులు

Reduced funds in February - Sakshi

అరకొరగానే ఫండ్లలో పెట్టుబడులు

డెట్‌ ఫండ్ల నుంచి ఉపసంహరణ: యాంఫీ  

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్ల ఆస్తులు గత నెలలో రూ.21,000 కోట్ల మేర తగ్గాయి. డెట్‌ సెగ్మెంట్‌ నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోవటం, ఫండ్లలో పెట్టుబడులు తగ్గడం వంటి కారణాల వల్ల ఈ ఏడాది  ఫిబ్రవరిలో ఈ స్థాయిలో మ్యూచువల్‌ ఫండ్ల నిర్వహణ ఆస్తులు (ఏయూఎమ్‌) తగ్గాయని అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా(యాంఫీ) తెలియజేసింది. యాంఫీ తాజా గణాంకాల ప్రకారం.., 

►భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 42 మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల నిర్వహణ ఆస్తులు ఈ ఏడాది జనవరిలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.22.41 లక్షల కోట్లకు పెరిగాయి. 
►ఇక ఫిబ్రవరిలో ఫండ్ల నిర్వహణ ఆస్తులు రూ.21,000 కోట్లు తగ్గి రూ.22.2 లక్షల కోట్లకు చేరాయి. 
►వివిధ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు గత నెలలో తగ్గాయి. ఈ ఏడాది జనవరిలో రూ.1.06 లక్షల కోట్లుగా ఉన్న ఫండ్ల పెట్టుబడులు ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.12,000 కోట్లకు పడిపోయాయి. 
►ఇన్‌కమ్‌ ఫండ్స్‌ నుంచి రూ.9,800 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది.
►గోల్డ్‌ ఎక్సే్చంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌) నుంచి రూ.94 కోట్ల పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top