ముంబై: బడ్జెట్ ప్రకటనకు అనుగుణంగానే... రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) చిన్న బ్యాంకుల ఏర్పాటు దిశగా తొలి అంకానికి తెరతీసింది. ఈ బ్యాంకులను నెలకొల్పేందుకు అవసరమైన ముసాయిదా(డ్రాఫ్ట్) మార్గదర్శకాలను గురువారం విడుదల చేసింది. దీంతోపాటు చెల్లింపులు ఇతరత్రా ప్రత్యేక అవసరాలకోసం ఉద్దేశించిన పేమెంట్ బ్యాంకులకు కూడా డ్రాఫ్ట్ మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. స్థానికంగా చిన్న వ్యాపారులు, రైతులు, అల్పాదాయవర్గాలు, అసంఘటిత రంగానికి తక్కువమొత్తంలో రుణాలు అందించడం ఇతరత్రా కార్యకలాపాలను ప్రతిపాదిత చిన్నబ్యాంకులు నిర్వహించనున్నాయి.
అదేవిధంగా వలస కార్మికుల నుంచి డిపాజిట్ల సేకరణ, నగదును బట్వాడా(రెమిటెన్సెస్) వంటి విధులను కూడా పేమెంట్ బ్యాంకులు నిర్వర్తిస్తాయి. డిఫరెన్షియేటెడ్(ప్రత్యేక అవసరాలకోసం ఏర్పాటయ్యేవి) బ్యాంకుల విభాగంలోకి వచ్చే ఈ పేమెంట్, చిన్న బ్యాంకులను దేశంలో అందరికీ బ్యాంకింగ్ సేవల కల్పన(ఫైనాన్షియల్ ఇన్క్లూజన్)లో భాగంగా ఏర్పాటు చేయాలని సంకల్పించారు.
తాజా బడ్జెట్లో చిన్న, డిఫరెన్షియేటెడ్ బ్యాంకుల ఏర్పాటుకు తగిన కార్యాచరణను ఆర్బీఐ రూపొందిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. కాగా, పూర్తిస్థాయిలో వాణిజ్య బ్యాంకుల ఏర్పాటుకోసం ఈ ఏడాది ఏప్రిల్లో మైక్రోఫైనాన్స్ కంపెనీ బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐడీఎఫ్సీలకు ఆర్బీఐ సూత్రప్రాయ అనుమతి మంజూరు చేయడం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో 27 ప్రభుత్వ రంగ, 22 పైవేటు రంగ బ్యాంకులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రతిపాదిత పోస్ట్ బ్యాంక్ అనేది పేమెంట్ బ్యాంక్తరహాలో డిపాజిట్ల సేకరణ, చెల్లింపులు జరిపేవిధంగా కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇటీవలే పేర్కొన్నారు.
మార్గదర్శకాలు ఇలా...
ప్రస్తుతం వాణిజ్య బ్యాంకుల ఏర్పాటుకు కనీసం మూలధనం రూ.500 కోట్లు కాగా, ఈ చిన్న, పేమెంట్ బ్యాంకులకు ఈ మొత్తం రూ.100 కోట్లుగా ఉండాలి.
ప్రతిపాదిత చిన్న బ్యాంకులు ఇతర వాణిజ్య బ్యాంకులమాదిరిగానే డిపాజిట్ల సమీకరణ, రుణాల జారీ వంటి విధులన్నీ చేపడతాయి. అయితే, కార్యకలాపాల్లో మాత్రం పరిమితి ఉంటుంది.
ఇక పేమెంట్ బ్యాంకులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిమిత స్థాయిలో బ్యాంకింగ్ సేవలు, ప్రొడక్ట్లను అందిస్తాయి. ఇందుకోసం తమ సొంత శాఖల నెట్వర్క్తోపాటు ఇతర నెట్వర్క్లకు సంబంధించిన బిజినెస్ కరస్పాండెంట్లను కూడా వినియోగించుకోవచ్చు.
ఈ బ్యాంకుల్లో విదేశీ పెట్టుబడులు ప్రస్తుత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) పాలసీ ప్రకారం ఉంటుంది.
ఇప్పుడున్న బ్యాంకింగేతర ప్రీ-పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ సేవల సంస్థలు, బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీలు(ఎన్బీఎఫ్సీ), కార్పొరేట్ బిజినెస్ కరస్పాండెంట్స్, మొబైల్ టెలిఫోన్ కంపెనీలు, సూపర్ మార్కెట్ చైన్లు, కంపెనీలు, రియల్టీ సహకార సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు పేమెంట్ బ్యాంకుల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇక చిన్న బ్యాంకుల విషయానికొస్తే... బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో పదేళ్ల అనుభవం ఉన్న భారతీయ పౌరులు(ఇక్కడ నివశించేవారు), కంపెనీలు, సొసైటీలు ప్రమోటర్లుగా వీటిని ఏర్పాటుచేసేందుకు అర్హులు.
ఎన్బీఎఫ్సీలు, మైక్రో ఫైనాన్స్ కంపెనీ(ఎంఎఫ్ఐ)లు, లోకల్ ఏరియా బ్యాంకులు కూడా తమ కార్యకలాపాలను చిన్న బ్యాంకులుగా మార్చుకునేందుకు వీలవుతుంది.
నిబంధనలకు అనువుగాఉంటే.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ నిపుణులు, ఎన్బీఎఫ్సీలకు చిన్న బ్యాంకుల ఏర్పాటులో ప్రాధాన్యత లభిస్తుంది.
చిన్న కస్టమర్లకు సేవలు, స్థానికంగా దృష్టిపెట్టడం వంటివి లెసైన్స్లు పొందేందుకు కీలకం.
బ్యాంకింగ్ సేవలు చాలా తక్కువగా ఉన్న రాష్ట్రాలు లేదా ఈశాన్య, తూర్పు, మధ్య భారత్లోని జిల్లాల్లో అధికంగా కార్యకలాపాలు ఉన్న దరఖాస్తుదారులకు పేమెంట్ బ్యాంకుల ఏర్పాటులో అధిక ప్రాధాన్యత లభిస్తుంది. అయితే, బ్యాంక్ నెలకొల్పిన తర్వాత భారీగా శాఖలను విస్తరించాల్సి ఉంటుంది. ప్రధానంగా మారుమూల ప్రాంతాలపై ఎక్కువగా దృష్టిపెట్టాలి.
పేమెంట్ బ్యాంకుల కనీస మూలధనంలో 40 శాతాన్ని ప్రమోటర్లు సమకూర్చాలి. ఐదేళ్లపాటు దీన్ని వెనక్కితీసుకోకుండా లాకిన్ వ్యవధి ఉంటుంది. బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభమైననాటినుంచి మూడేళ్లలో ప్రమోటర్ల వాటాను 40%కి, 10 ఏళ్లలో 30%కి, 12 ఏళ్లలో 26 శాతానికి తగ్గించుకోవాలి. చిన్న బ్యాంకులకూ ఇది వర్తిస్తుంది.
నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్), చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్)లతో సహా వాణిజ్య బ్యాంకులకు అమలు చేస్తున్న నిబధనలన్నీ చిన్న బ్యాంకులకు వర్తిస్తాయి.
రుణాల పోర్ట్ఫోలియోలో కనీసం 50 శాతం రూ.25 లక్షల వరకూ విలువైన రుణాలు తప్పనిసరి. ఇందులో కూడా సూక్ష్మ, చిన్న కంపెనీలకు ప్రాధాన్యమివ్వాలి.
ఈ మార్గదర్శకాలపై సూచనలు, అభిప్రాయాలను తెలిపేందుకు ఆగస్టు 28 వరకూ ఆర్బీఐ గడువు ఇచ్చింది.
చిన్న బ్యాంకులు వస్త్తున్నాయ్..!
Published Fri, Jul 18 2014 12:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement