పుణే: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) ప్రస్తుతం నెలకొన్న సమస్యలకు ఢిల్లీ రాజకీయ నేతలే కారణమని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మాజీ చైర్మన్ ఎం దామోదరన్ వ్యాఖ్యానించారు. ఈ సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు పీఎస్బీలను ప్రైవేటీకరించడమనేది సరైన పరిష్కార మార్గం కానే కాదన్నారు. ఆర్బీఐ నిర్వహణలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్లో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విద్యార్థులకు ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘అనేక సంవత్సరాలుగా ఢిల్లీ (రాజకీయ నేతల) నుంచి ముంబైకి (పలు బ్యాంకుల ప్రధాన కార్యాలయాలున్న ఆర్థిక రాజధాని) వస్తున్న ఫోన్ కాల్సే ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎదుర్కొంటున్న సంక్షోభానికి మూలం. ముంబైలోని వారు ఎటువంటి ప్రశ్నలు వేయకుండా ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలు తు.చ. తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు‘ అని దామోదరన్ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను సమర్థిస్తూ.. మొండిబాకీల సమస్యను సరిదిద్దాలంటే ఆయా బ్యాంకుల ప్రైవేటీకరణ తగిన పరిష్కారమార్గం కాదని చెప్పారు.
నిజాయితీకి ’ప్రైవేట్’ పర్యాయపదమేమీ కాదు..
ప్రభుత్వ రంగ బ్యాంకుల యాజమాన్య సంబంధమైన, విభిన్నమైన పాలనా సంబంధమైన అంశాలే వాటి సమస్యలకు కారణమని ఆయన పేర్కొన్నారు. ‘ప్రతిదీ ప్రైవేటీకరించాలని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే.. ప్రైవేటీకరణ అనేది నిజాయితీకి, సమర్థతకు పర్యాయపదమేమీ కాదనడానికి నిదర్శనంగా ఇటీవల పలు ఉదంతాలు కనిపిస్తున్నాయి‘ అని దామోదరన్ చెప్పారు. ప్రశ్నార్థకమైన కార్పొరేట్ గవర్నెన్స్ విధానాలతో ప్రైవేట్ దిగ్గజాలు ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. భారతదేశం వంటి విభిన్న దేశంలో పటిష్టమైన ప్రభుత్వ రంగ సంస్థలు ఎంతో అవసరమని ఆయన తెలిపారు. ‘యాజమాన్య అధికారం ఉంది కదా అని మేనేజ్మెంట్ కూడా చేయొచ్చని ప్రతీ లావాదేవీ తమ ఆదేశాల ప్రకారమే జరగాలనుకున్న పక్షంలో అలాంటి యాజమాన్యం వల్ల సమస్యలు తప్పవు. ప్రైవేటీకరణ చాలా గొప్పదని అనుకోవడం లేదు. ప్రభుత్వ రంగ సంస్థల సమస్యలను విశ్లేషించి, పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఎలాంటి సమస్యలు లేని అద్భుతమైన ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అనేకం ఉన్నాయి‘ అని దామోదరన్ పేర్కొన్నారు.
బ్యాంకుల దుస్థితికి రాజకీయ నేతలే కారణం
Published Thu, Apr 19 2018 6:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ లీక్.. ఫోటోలు వైరల్
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement