⇒ 28 శాతం స్లాబ్లోకి ఎలా చేరుస్తారు
⇒ చిన్న కంపెనీలు మూతపడతాయి
⇒ మౌల్డెడ్ ఫర్నిచర్ తయారీదార్ల సంఘం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ వస్తువుల జాబితాలోకి ప్లాస్టిక్ కుర్చీలను చేర్చడాన్ని ప్లాస్టిక్ మౌల్డెడ్ ఫర్నిచర్ తయారీదారుల సంఘం తప్పుపట్టింది. జీఎస్టీ కౌన్సిల్ ప్లాస్టిక్ కుర్చీలపై 28 శాతం పన్ను రేటు నిర్ణయించింది. వీటిని హౌస్హోల్డ్ వస్తువుల జాబితాలోకి చేర్చడం ద్వారా 18 శాతం పన్ను స్లాబులోకి తేవాలని సంఘం డిమాండ్ చేస్తోంది. ఇప్పటి వరకు ప్లాస్టిక్ మౌల్డెడ్ ఫర్నిచర్ కంపెనీలు 5 శాతం వ్యాట్, 12.5 శాతం ఎక్సైజ్ డ్యూటీని చెల్లించాయి. దేశంలో 60 శాతం చిన్న స్థాయి కంపెనీలే ఉన్నాయి.
ప్లాస్టిక్ కుర్చీలపై పన్ను 28 శాతముంటే పరిశ్రమలో ఈ తయారీ కంపెనీలు మనలేవని సంఘం ప్రెసిడెంట్ కె.పి.రవీంద్రన్ తెలిపారు. ‘పెద్ద బ్రాండ్లు ఎంత ధర పెట్టినా కస్టమర్లు కొంటారు. చిన్న కంపెనీలు స్వల్పంగా ధర సవరించినా కొనేవారుండరు. రీసైక్లింగ్ ప్లాస్టిక్ తయారీలో ఉన్న యూనిట్లకు ఇప్పటి వరకూ పన్ను మినహాయింపు ఉంది. ఎస్ఎస్ఐ యూనిట్లకు ఎక్సైజ్ డ్యూటీ లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా 28 శాతం పన్ను పరిధిలోకి వచ్చాయి. ఇది భారత పరిశ్రమకు నష్టాన్ని కలిగిస్తుంది’ అని తెలిపారు.
చైనా దిగుమతుల వెల్లువ..: ప్రభుత్వం పన్ను సవరించకపోతే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి విఘాతం కలుగుతుందని సంఘం కార్యదర్శి సుశీల్ అగర్వాల్ అన్నారు. సామాన్యులు వాడే ప్లాస్టిక్ కుర్చీ లగ్జరీ ఎలా అయిందో అర్థం కావడం లేదన్నారు. ‘భారత కంపెనీ ఒక ఉత్పాదనను రూ.100కు విక్రయిస్తే, అదే ఉత్పాదనను చైనా కంపెనీ రూ.60కే ఇక్కడ ప్రవేశపెడుతుంది. దీంతో చైనా ఉత్పత్తులు వెల్లువలా వచ్చి పడతాయి. ఇక్కడి కంపెనీలు మూతపడక తప్పదు.
మౌల్డెడ్ ప్లాస్టిక్ తయారీ రంగంలో 200 కంపెనీలున్నాయి. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందినవి 40 దాకా ఉంటాయి. 20,000 మంది ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు. వేల కుటుంబాలు రోడ్డున పడతాయి. పరిశ్రమ పరిమాణం రూ.300 కోట్లు. ఇందులో ప్లాస్టిక్ చైర్ల విక్రయాలు 80%. అందుకే జీఎస్టీ ప్రభావం ఎక్కువ’ అని చెప్పారు. ముడి ప్లాస్టిక్పై 18% జీఎస్టీ ఉందని సంఘం హైదరాబాద్ ప్రెసిడెంట్ ఉపేందర్ గుప్తా తెలిపారు.
ప్లాస్టిక్ కుర్చీ లగ్జరీ వస్తువా..?
Published Thu, Jun 8 2017 12:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement