ఒక్క మిస్డ్‌ కాల్‌తో పీఎఫ్‌ బ్యాలెన్స్‌

PF Balance Get Through Missed Call - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగస్తులకు కేంద్ర ప్రభుత్వం మరో వెసులుబాటును కల్పించింది. కేవలం ఒక్క మిస్డ్‌ కాల్‌తోనే  ప్రావిడెంట్‌ ఫండ్‌(పీఎఫ్‌) బ్యాలెన్స్‌ ఎంత ఉందో తెలుసుకునే వీలుకల్పించింది. ఉద్యోగస్తులు పీఎఫ్‌ బ్యాలెన్స్‌  వివరాలను సులువుగా పొందడానికే ఈ సాంకేతికతను ప్రవేశపెట్టినట్లు కేంద్ర కార్మిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ ఎంప్లాయీస్‌(ఈపీఎఫ్‌ఓ) స్కీమ్‌లోని ఉద్యోగులు ఎవరైతే యూనివర్సల్‌ అకౌంట్‌ నెంబర్‌(యూఏఎన్‌) పోర్టల్‌లో కూడా రిజస్టర్‌ అయి ఉంటారో వారు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. అంటే బ్యాంక్‌ బ్యాలెన్స్‌ వివరాలు పొందే మాదిరిగానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ వివరాలను కూడా తెలుసుకోవచ్చన్న మాట. యూఏఎన్‌ పోర్టల్‌లో ఉద్యోగులు పేర్కొన్న తమ ఫోన్‌ నెంబర్‌ నుంచి 011-22901406 కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలూ.. వెంటనే వివరాలు ఎస్‌ఎంఎస్‌ ద్వారా అందుతాయి. ఈ సర్వీస్‌కు ఎలాంటి చార్జీలు ఉండబోవని కార్మిక శాఖ తెలిపింది.

అదే విధంగా రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌ నుంచి ‘EPFOHO UAN’  అని టైప్‌ చేసి 7738299899 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేయడం ద్వారా కూడా వివరాలు పొందవచ్చు. ఇంగ్లీష్‌, హిందీతో పాటు మరో 8 భారతీయ భాషల్లో బ్యాలెన్స్‌ వివరాలు పొందవచ్చని కేంద్ర కార్మిక శాఖ పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top