కార్స్‌24లో ధోనీ పెట్టుబడి | MS Dhoni Investments in Cars24 | Sakshi
Sakshi News home page

కార్స్‌24లో ధోనీ పెట్టుబడి

Aug 14 2019 10:55 AM | Updated on Aug 14 2019 11:04 AM

MS Dhoni Investments in Cars24 - Sakshi

న్యూఢిల్లీ: గురుగ్రామ్‌ కేంద్రంగా పనిచేసే టెక్నాలజీ ఆధారిత సెకండ్‌ హ్యాండ్‌ కార్ల విక్రయ సంస్థ ‘కార్స్‌24’లో.. టీం ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ పెట్టుబడి పెట్టినట్లు ఆ సంస్థ మంగళవారం ప్రకటించింది. కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా మాజీ కెప్టెన్‌ వ్యవహరించనున్నారని వెల్లడించింది. ఆర్థిక పరమైన విషయాలను వెల్లడించని ఈ సంస్థ.. పెట్టుబడి డీ–రౌండ్‌ ఆఫ్‌ ఫండింగ్‌లో భాగమని పేర్కొంది. ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ విక్రమ్‌ చోప్రా మాట్లాడుతూ.. ‘భారత క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటుచేసుకున్న ధోని తనకు ఎదురైన ప్రతి సమస్యను చక్కగా పరిష్కరించారు. ఇటువంటి గొప్ప వ్యక్తి మా సంస్థకు భాగస్వామికావడం విశేషం’ అని అన్నారు. ఇక దేశవ్యాప్తంగా 230 నగరాల్లో 10,000 ఛానల్‌ భాగస్వాములను కలిగిన ఈ సంస్థకు 35 నగరాల్లో 155 శాఖలు ఉన్నాయి. ఇటీవలే ఫ్రాంచైజ్‌ మోడల్లోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. 2021 నాటికి 300 ద్వితీయ శ్రేణి నగరాల్లోకి చొచ్చుకునిపోవడమే లక్ష్యంగా తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement