మైక్రోమాక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ @ 999 | Micromax Smartphone @ 999 | Sakshi
Sakshi News home page

షరతులు వర్తిస్తాయి: మైక్రోమాక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ @ 999

Oct 24 2017 1:12 AM | Updated on Oct 24 2017 1:30 PM

Micromax Smartphone @ 999

న్యూఢిల్లీ: దేశీ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘మైక్రోమాక్స్‌’ తాజాగా ‘భారత్‌ 2 అల్ట్రా’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి ఆవిష్కరించింది. దీని ధర రూ.2,899.  అయితే వొడాఫోన్‌ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్‌ ఉంది. రూ.2,899 వెచ్చించి ఫోన్‌ను కొన్న కస్టమర్లు వొడాఫోన్‌ సిమ్‌ను (కొత్త/పాత కనెక్షన్‌) వాడితే రెండు విడతల్లో రూ.1,900 రిఫండ్‌ పొందొచ్చు.

కాకపోతే వొడాఫోన్‌ సిమ్‌ను మూడేళ్లపాటు ప్రతి నెలా కనీసం రూ.150లతో రీచార్జ్‌ చేసుకుంటేనే ఇది వర్తిస్తుంది. ఇలా చేసే యూజర్ల కు తొలి 18 నెలల తర్వాత రూ.900, తర్వాతి 18 నెలల తర్వాత మరో రూ.1,000 క్యాష్‌బ్యాక్‌ అంది... అది వొడాఫోన్‌ ‘ఎం–పైసా’ వాలెట్‌లో జమవుతుంది. స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.2,899లో రూ.1,900 క్యాష్‌బ్యాక్‌ను తీసేస్తే అప్పుడు రూ.999లకే ఫోన్‌ వచ్చినట్లు అవుతుంది.

కాగా ‘భారత్‌ 2 అల్ట్రా’ స్మార్ట్‌ఫోన్‌లో 4 జీబీ మెమరీ, 512 ఎంబీ ర్యామ్, 1.3 గిగాహెర్ట్‌›్జ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్, 4 అంగుళాల స్క్రీన్, 2 ఎంపీ రియర్‌ కెమెరా, 0.3 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 1,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ మార్‌‡్షమాలో ఓఎస్‌ వంటి ప్రత్యేకతలున్నాయని మైక్రోమాక్స్‌ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement