ఎల్‌ఐసీ నుంచి మైక్రో ఇన్సూరెన్స్ పథకం | Micro-insurance plan from LIC | Sakshi
Sakshi News home page

ఎల్‌ఐసీ నుంచి మైక్రో ఇన్సూరెన్స్ పథకం

Dec 31 2014 1:28 AM | Updated on Sep 2 2017 6:59 PM

ప్రభుత్వరంగ ఎల్‌ఐసీ అల్పాదాయ వర్గాల వారి కోసం సూక్ష్మ బీమా పథకం ‘భాగ్యలక్ష్మి’ ప్రవేశపెట్టింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ ఎల్‌ఐసీ అల్పాదాయ వర్గాల వారి కోసం సూక్ష్మ బీమా పథకం ‘భాగ్యలక్ష్మి’ ప్రవేశపెట్టింది. పాలసీ కాలపరిమితి కంటే రెండు సంవత్సరాలు తక్కువ ప్రీమియం చెల్లించడం ఈ పాలసీలోని ప్రధాన ఆకర్షణ. ఏడు నుంచి 15 ఏళ్ల కాలపరిమితిలో భాగ్యలక్ష్మి పథకం లభిస్తోంది.

18 నుంచి 55 ఏళ్ల లోపు వారు ఈ పాలసీని తీసుకోవడానికి అర్హులు. కనీస బీమా రక్షణ మొత్తం రూ. 20,000, గరిష్ట బీమా మొత్తం రూ. 50,000గా నిర్ణయించడం జరిగింది. పాలసీ కాలపరిమితి తర్వాత చెల్లించిన ప్రీమియానికి 110 శాతం గ్యారంటీగా ఇవ్వనున్నట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement