మారుతీ ‘ఎస్-క్రాస్’ ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం | Maruti 'S-Cross' start early bookings | Sakshi
Sakshi News home page

మారుతీ ‘ఎస్-క్రాస్’ ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం

Jul 9 2015 2:29 AM | Updated on Sep 3 2017 5:08 AM

మారుతీ సుజుకీ మార్కెట్‌లోకి తీసుకురానున్న ‘ఎస్-క్రాస్’ మోడల్ ప్రి-లాంచ్ బుకింగ్స్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది.

న్యూఢిల్లీ : మారుతీ సుజుకీ మార్కెట్‌లోకి తీసుకురానున్న ‘ఎస్-క్రాస్’ మోడల్ ప్రి-లాంచ్ బుకింగ్స్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఎస్-క్రాస్ మోడల్‌ను ఆగస్టుకు ముందుగానే మార్కెట్‌లోకి తీసుకొస్తామని, వాటిని నెక్సా షోరూమ్‌లలో విక్రయిస్తామని మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. ఈ మోడల్ ధర రూ.10 లక్షలుగా ఉంటుందని అంచనా. మారుతీ తన ప్రీమియం రేంజ్ కార్లను విక్రయించడానికి నెక్సా షోరూమ్‌లను ఏర్పాటుచేసింది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30 పట్టణాల్లో 100 నెక్సా షోరూమ్‌లను ఏర్పాటుచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement