ప్రైవేట్ ఈ-మెయిల్స్ వాడకండి.. | Maharashtra Government Bans Use of Private Email Accounts for Employees | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ ఈ-మెయిల్స్ వాడకండి..

Jun 2 2016 6:37 PM | Updated on Oct 8 2018 6:22 PM

ప్రైవేట్ ఈ-మెయిల్స్ వాడకండి.. - Sakshi

ప్రైవేట్ ఈ-మెయిల్స్ వాడకండి..

మహారాష్ట్ర ప్రభుత్వాధికారులు ప్రైవేట్ ఈ-మెయిల్ అకౌంట్లు వాడకంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

ముంబయి: మహారాష్ట్ర ప్రభుత్వాధికారులు ప్రైవేట్ ఈ-మెయిల్ అకౌంట్లు వాడకంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. మహారాష్ట్ర సచివాలయం 'మంత్రాలయ'లో కంప్యూటర్లకు ఇటీవల ఏర్పడిన లాకీ వైరస్ దెబ్బతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అధికార పనులకు ప్రైవేట్ ఈ-మెయిల్ లను వాడొద్దని ఆదేశాలు జారీచేసింది. అధికార ఈ-మెయిల్ అకౌంట్లనే ఉద్యోగులు వాడాలని పేర్కొంది. మంత్రాలయాల్లో 150 కంప్యూటర్లు ఈ వైరస్ బారిన పడ్డాయి. వాటిలో ఎక్కువగా రెవెన్యూ, పబ్లిక్ వర్క్ డిపార్ట్ మెంట్ వే ఉన్నాయి. ఈ కంప్యూటర్లను ఫొరెన్సిక్ టెస్టు కోసం ల్యాబ్ కు పంపించారు.

ఈ సంఘటన తర్వాత ఇన్ ఫర్ మేషన్ అండ్ టెక్నాలజీ అధికారులతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమావేశమయ్యారు. ప్రభుత్వ డేటాలో ఎలా భద్రత పెంచాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించారు. మంత్రాలయ ఉద్యోగులందరూ కచ్చితంగా ప్రభుత్వ ఈ-మెయిల్ ఐడీలనే ప్రభుత్వ పనులకు వాడితే, ఈ వైరస్ బారినుంచి తప్పించుకోవచ్చని ఐటీ ప్రిన్సిపాల్ కార్యదర్శి వీకే గౌతమ్ సూచించారు. ఈ సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 90శాతం ఉద్యోగులు జీమెయిల్, యాహు అకౌంట్లనే అధికార పనులకు వాడుతున్నారని అధికారులు చెప్పారు. అన్నీ ముఖ్యమైన అధికార పత్రాలను ఎనిమిది నుంచి తొమ్మిదో రోజుల్లో అధికార మెయిళ్లకు పంపించుకోవాలని గౌతమ్ ఉద్యోగులను ఆదేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement