రూ.1,323 కోట్ల ఆర్బిట్రేషన్‌ను కోల్పోయిన మారన్‌

Kalanithi Maran loses Rs 1323-cr case - Sakshi

ముంబై: స్పైస్‌జెట్‌ మాజీ యజమాని, సన్‌ టీవీ గ్రూపు అధినేత కళానిధి మారన్‌కు రూ.1,323 కోట్ల నష్ట పరిహారాన్ని స్పైస్‌జెట్‌ చెల్లించక్కర్లేదని ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ తేల్చింది. కన్వర్టబుల్‌ వారంట్లు, ప్రిఫరెన్షియల్‌ షేర్లు జారీ చేయనందుకు ఈ మొత్తాన్ని కళానిధి మారన్, ఆయనకు చెందిన కాల్‌ ఎయిర్‌వేస్‌కు చెల్లించాలన్న అభ్యర్థనను ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ కొట్టివేసినట్టు స్పైస్‌జెట్‌ తెలిపింది.

అయితే, అదే సమయంలో మారన్‌కు రూ.579 కోట్లను 12 శాతం వడ్డీ రేటుతో వెనక్కి చెల్లించేయాలని ఆదేశించినట్టు పేర్కొంది.  ఈ కేసు 2015 జనవరి ముందు నాటిది. స్పైస్‌జెట్‌ను కళానిధి మారన్‌ నుంచి దాని మాజీ యజమాని అజయ్‌ సింగ్‌ కొనుగోలు చేయగా... నాడు చేసుకున్న ఒప్పందాన్ని సింగ్‌ అమలు చేయలేదని మారన్‌ ఆరోపణ.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top